పారితోషికంలో రజనీని అధిగమించిన ప్రభాస్!

  • 'బాహుబలి'తో జాతీయ స్థాయి ఇమేజ్ 
  • ప్రభాస్ సినిమా హిందీ వెర్షన్ లకు భారీ ఆఫర్లు
  • నాగ్ అశ్విన్ సినిమాకు 100 కోట్లు
హీరో ప్రభాస్ ని ఎవరూ ఊహించని స్థాయికి 'బాహుబలి' చిత్రం తీసుకుపోయింది. ఆర్టిస్టుగా జాతీయ స్థాయిలో పేరు తేవడమే కాకుండా అతని ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. దాంతో పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ఎదిగిపోయాడు. ఇప్పుడు అతను నటించే సినిమా అనౌన్స్ అయితే చాలు.. హాట్ కేక్ లా బిజినెస్ జరిగిపోతోంది. హిందీలో కూడా మార్కెట్ ఏర్పడడంతో హిందీ వెర్షన్ కి కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ గా ప్రభాస్ పారితోషికం కూడా పెరిగిపోయింది. తాజగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే భారీ చిత్రంలో ప్రభాస్ నటించనున్నాడు. దీనికి కళ్లుచెదిరే రీతిలో పారితోషికాన్ని ఇస్తున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. సినిమా పారితోషికం, డబ్బింగ్ హక్కుల పారితోషికం.. మొత్తం కలిపి 100 కోట్లు అతనికి ముట్టజెబుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు రజనీకాంత్ 70 కోట్ల వరకు పారితోషికం తీసుకునే వారనీ, ఇప్పుడు ప్రభాస్ ఆయనని అధిగమించి మొత్తం భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్ హీరోగా ఎదిగిపోయాడనీ అంటున్నారు.

Prabhas
Nag Ashvin
Rajanikanth
Bahubali

More Telugu News